బోనాల వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. మేళతాళాల మధ్య నిర్వహించిన ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాలమూరులో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు.
పాలమూరు, జూలై 11 : తెలంగాణ ఏర్పడిన తర్వాతే బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్, కొత్తగంజి, పాతపాలమూరు, కోయిల్కొండ ఎక్స్రోడ్, కిద్వాయిపేట, బండమీదిపల్లి, బీకే రెడ్డి కాలనీల్లో పోచమ్మ పండుగను నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ము ఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తె లంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వం తరఫున స్థానిక రవీంద్రనగర్లోని పోచ మ్మ ఆలయంలో బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే విధంగా 33వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వార్షికోత్సవాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అనంతరం వివిధ కాలనీల్లోని మహిళలు బోనాలతో ఊరేగింపులు నిర్వహించగా అందులో డప్పులు ధరువులు, కోలాట ప్రదర్శనలు, తీన్మార్ స్టెప్పులు, ఆటాపాటలు, పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు అమ్మవారికి బోనంతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు వేద, గోవిందు, లక్ష్మి, ఆనంద్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న గౌలిగూడ అంటే తెలంగాణ, ఏపీలో తెలియని వారుండరని కానీ గౌలీ కులస్తులకు సమైక్య రాష్ట్రంలో గుర్తింపే కష్టంగా ఉండిందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వందేండ్ల చరిత్ర ఉన్న గౌలి కులస్తులకు బీసీ జాబితాలో చోటు లేక వారి పిల్లలు చదువుకునేందుకూ ఇబ్బందులు పడ్డారని, ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించి గౌలి కులాన్ని బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట లక్ష్మమ ఆలయంలో గౌలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహామంగళ హారతి కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వందల ఏండ్ల చరిత్ర ఉన్న గౌలీ సమాజానికి సమైక్య రాష్ట్రంలో గుర్తింపు లేక పోవడం బాధాకరమన్నారు. తాను మంత్రి అయ్యాక వీరి సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బీసీ జాబితాలో చేర్చామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎం బీసీ కులాలలో ఉన్న గౌలి సమాజానికి ఒక కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు గోవిందు, చిన్న, బీఆర్ఎస్ నాయకులు హరి, శంకర్, గౌలి సమా జం నాయకులు గౌలివీరు, కిశోర్, అంబ న్, వెంకట్, సురేందర్ పాల్గొన్నారు.