వనపర్తి, ఫిబ్రవరి 3: ప్రత్యేకాధికారులు పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం ము లుగు జిల్ల్లా నుంచి మంత్రి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఈనెల 7 తేదీ నుంచి 15 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రత్యేకాధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వచ్చే వేసవిలో తాగు నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి తాగునీటి సరఫరాను పరిశీలించి సమస్య ఉంటే యుద్ధ్దప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున కేటాయించిన నిధులను సైతం ఖర్చు చేసుకోవచ్చన్నారు.
ఇప్పటి వరకు తాగునీటి సరఫరా పర్యవేక్షణ మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో ఉండేదని ఇక నుంచి గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తారన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు,నర్సరీల పర్యవేక్షణ, సెగ్రిగేషన్ షెడ్, ఉపాధిహామీ వంటి కార్యక్రమాలు సమాజావుగా నిర్వహించేందుకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. ఉపాధిహామీలో ప్రతి కూలికి పని కల్పించడంతో పాటు వేసవిలో వారు పనిచేసేచోట తాగునీరు, వైద్య సదుపాయం నీడ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
255 గ్రామాలకు ప్రత్యేకాధికారులు
కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. వారికి సోమవారం పంచాయతీ రాజ్ యాక్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించామ న్నారు. ఈ నెల 7 నుంచి 15 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్యవారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధిహామీలో జాబ్కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తామని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్పరెన్స్లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి రావొద్దు
వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి అనసూయ(సీతక్క) అన్నారు. శనివారం మంత్రి ప్రత్యేకాధికారులచే గ్రామ పంచాయతీపాలన నిర్వాహణపై పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. లీకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికా బద్ధంగా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ప్రత్యేకా ధికారులు ప్రజలకు మంచి పాలన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్, అధికారులు కాంత మ్మ, ఉమాదేవి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.