వనపర్తి, జూన్ 12 : నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఉల్లాసం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పోలీసు, యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ను కలెక్టర్ తేజస్ నందలాల్పవార్తో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకో పార్కు వరకు రన్ను చేపట్టారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ పరుగులు అభివృద్ధికి సంకేతమన్నారు.
ప్రతిఒక్కరూ దినచర్యలో భాగంగా శారీరక వ్యాయాయం చేయడం వల్ల శారీరక రుగ్మతలు తొలిగి ఆరోగ్యవంతమైన జీవితం సొంత మవు తుందన్నారు. ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పా టు చేయడం ద్వారా నడకకు వచ్చే వారికి ఎం తో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సఖి సెంటర్ ఆధ్వర్యంలో ఎకో పార్కు వద్ద చిన్నారులతో మాన వహారం ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి పోస్టర్లను విడుదల చే శారు. బాలకార్మిక వ్య వస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని మంత్రి పిలుపుని చ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, యువ జన క్రీడల శాఖ జిల్లా అధికారి సుధీర్రెడ్డి, స ఖి నిర్వాహకురాలు చెన్నమ్మాథామస్, చంద్ర శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ మ హేశ్వర్రెడ్డి, క్రీడాకారులు తదిత రులు పాల్గొన్నారు.