వనపర్తిరూరల్, డిసెంబర్ 5: రసాయనిక ఎరువుల వాడకంతో పుడమితల్లి విషపూరితంగా మారే పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాకేంద్రంలోని నాగవరం రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, వ్యవసాయ అదనపు సంచాలకులు రాములు, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేతలు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుధాకర్రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో వచ్చే ఆహార పదార్థాలన్నీ విషపూరితంగా మారాయన్నారు. అవసరానికి మించి రైతులు రసాయనిక ఎరువులను వాడ టం వల్ల సహజంగా భూమిలో ఉండే పోషకాలు తగ్గిపోతున్నాయని, అందుకే పంట దిగుబడి తగ్గుతుందన్నారు. భూసారాన్ని పెంచే విధంగా పచ్చిరొట్ట, పిల్లి పెసర సాగు చేస్తే భూసారానికి దోహదపడుతుందన్నా రు. గతంలో సాగునీరు, విద్యుత్ , రైతు ప్రోత్సాహకా లు అందక రైతులు పంట సాగును భారంగా భావించే వారన్నారు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, కొ నుగోలు చేసి అదుకుంటున్నదన్నారు. రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని సగర్వంగా చెప్పుకొవచ్చునన్నారు.
ఈ ఏడాది జిల్లాలో వానకాలం సాగులో 1,82,963ఎకరాల్లో వరి సాగవుతుందన్నారు. 5లక్షల 24వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే పరిస్థితులున్నట్లు వ్యవసాయ అధికారులు అంచ నా వేశారన్నారు. రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సహజ ఎరువులతో సాగు చేసుకునేలా వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. పంటల మార్పిడితోనే భూసారం పెరుగుతుందన్నారు. ఆయిల్ పాం తోటల పెంపకంతో అధిక ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ కింద పనిముట్లను అందజేసేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు.
అదేవిధంగా జిల్లాకేంద్రంలో రైతు శిక్షణాకేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, దీంతో ఏడాది పొడవున రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రైతు వేదికలు రైతులకు మరింత ఉపయోగపడుతాయన్నారు. అందుకే మా తల్లిదండ్రుల పేరున జిల్లాలో రెండు రైతువేదికలను సొంత డబ్బులతో వనపర్తిలోని నాగవరం, పాన్గల్లో నిర్మించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో రెండు ఏడీఏ కార్యాలయాలు మంజూరు చేయించడం జరిగిందని, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా వ్వవసాయ కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయ ని, రాష్ట్రంలోనే తొలి వ్వవసాయ కళాశాల మన జిల్లాలోనే ఏర్పాటు కాబోతుందన్నారు. జిల్లా ఫైలెట్ ప్రాజె క్టు కింద వ్యవసాయ సాగు భూములకు మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు కార్డులను అందజేస్తామన్నారు. దీంతో రైతులు వారి భూమి పరిస్థితిని బట్టి సాగు చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో భూమి ఉన్నవారు, వ్యవసాయం చేసేవాడే గొప్పవారన్నారు. అనంతరం మండలస్థాయి ఏఈవో, సర్పంచులకు డ్రమ్ సీడర్ యంత్రాలను మంత్రి చేతులమీదుగా అందజేశారు.
అంతకుముందు నేల రకాలు, పంటల మార్పిడి, వ్యవసాయ సాగులో మెళకువలను సీనియర్ శాస్త్రవేతలు, కలెక్టర్ తదితరులు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్కుమార్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా కన్వీనర్ కురుమూర్తియాదవ్, కౌన్సిలర్ జయసుధ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, పీఏసీసీఎస్ వనపర్తి చైర్మన్ వెంకట్రావు, ఏడీఏ సుధాకర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.