పాలమూరు, నవంబర్ 9 : దక్షత కలిగిన కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి జల జం సత్యనారాయణ అని, ఆయన మా ట్లాడిన మాటలను అర్థం చేసుకోవడానికి చాలా ఆలోచించాల్సి వచ్చేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై ‘ఇప్పపూలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీ.శే. జలజం సత్యనారాయణ చివరి కోరికగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు.
తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా జలజం పేరు గడించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా మార్గదర్శనం చేశారని కొనియాడారు. న్యాయవాది వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జలజం అందరికి ఆత్మీయుడన్నారు. సభాధ్యక్షురాలు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ జలజం గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, న్యాయవాది బెక్కెం జనార్దన్, జలజం సుషుమ్నరాయ్, జలజం వైశేషిరాయ్, జలజం విదూషిరాయ్, లక్ష్మణ్గౌడ్, శ్రీకాంత్, వెంకటేశ్వర్రెడ్డి, కవులు, రచయితలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.