దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీ రాములు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలతోపాటు ప్రతి హక్కునూ వినియోగించుకోవాలని సూచించారు. అలాగే క్యాంప్ కార్యాలయంలో 150 మందికి రూ.31.82 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
వనపర్తి, మే 2 : దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమి టీ సమావేశాన్ని ఎంపీ రాములు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తితో కలిసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం ప్రభు త్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని.. వాటిని సద్వినియోగం చేసుకునే లా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. దళిత చట్టాలను కఠినంగా అమ లు చేసి.. వారికి సంక్రమించాల్సిన ప్రతి హక్కునూ వినియోగించుకునేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. డీవీఎం సీ సభ్యులు, అధికారులు ఎప్పటికప్పు డు దళితవాడలను సందర్శించాలన్నారు.
అందరూ సమానంగా జీవించాలి
ప్రతి జిల్లాకు ఒక పీపీ ఉండాలని కోరు తూ ప్రభుత్వానికి లేఖ రాయాలని మం త్రితోపాటు కలెక్టర్ను ఎంపీ రా ములు కోరారు. కుల వివక్ష లేకుండా ప్రతి గ్రా మంలో అందరూ కలిసిమెలిసి జీవించే లా చర్యలు తీసుకోవాలన్నారు. అనంత రం జిల్లాలో దళితుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. గ్రామాల్లో అధికారులు పర్యటించాలని.. దళితులకు అందాల్సిన నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాల ని అధికారులకు సూచించారు.
కచ్చితంగా అమలు చేస్తాం.. కలెక్టర్
జిల్లాలో దళిత అభివృద్ధి పథకాలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్ వివరించారు. ప్రతి నెలా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అంటరానిత నం నిర్మూలన, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని.. సహపం క్తి భోజనాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిఒక్కరూ సమానమనే భావనతో జీవించాలని, దళిత చట్టాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రక్షితామూర్తి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, ఆర్డీ వో పద్మావతి, కమిటీసభ్యులు నాగరా జు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.