వనపర్తి, సెప్టెంబర్ 20 (నమస్తే తె లంగాణ) : ఆపత్కాలంలో సీఎంఆర్ఎ ఫ్ బాధితులకు అండగా నిలిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చె క్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం 115 మందికి రూ.33.15 లక్షలు అందజేయగా.. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవన్నారు.
సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఎంతో మంది పేదల కు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు. నిరుపేదలకు భరోసానిస్తూ దవాఖాన ల్లో వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్లతో ఒంటరి మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని తెలిపారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నా రు. రైతుబీమా, నిరంతర విద్యుత్తోపా టు పలు పథకాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. అత్యాధునిక వసతులతో మెడికల్ కళాశాలలు, దవాఖానలను నెలకొల్పి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అం దుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రజల తరపున సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, నాయకులు పాల్గొన్నారు.