భూత్పూర్/అలంపూర్, అక్టోబర్ 4 : స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జాతీయస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీలుగా ఎంపికైనందున మంగళవారం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో మున్సిపల్ చైర్మన్లను సత్కరించారు.
అందులో భాగం గా భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, కమిషనర్ నూరుల్నజీబ్, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమవెంకటేశ్, కమిషనర్ నిత్యానంద్ మంత్రి చేతులమీదుగా సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కో మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ రూ.2కోట్ల నజరానా ప్రకటించినట్లు తెలిపారు.