కొల్లాపూర్ రూరల్, డిసెంబరు 17 : పండ్లల్లో రారా జు మామిడి పండు, దాని తియ్యదనం గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం ఉండదు. వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినట్లే. మామిడి పంట్ల సీజన్ కోసం మామిడి ప్రియులు దేశవిదేశాల్లోనూ ఎదురు చూస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత కల్గిన మా మిడికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దేశ విదేశాలకు ఎగుమతి జరిగే వాణిజ్య పంటల్లో మామిడి అగ్రగామిగా ఉంది. నాగర్కర్నూల్ జిల్లా ప్రాంతంలోని కొల్లాపూర్ ప్రాంతం మామిడికి పెట్టింది పేరు. 27వేల హెక్టార్లలో కేవలం కొల్లాపూర్ ప్రాంతంలోనే మామిడి సాగు అవుతోంది. మామిడి పండ్ల ప్రియులకు తియ్యదానాన్ని, మామిడి పండ్ల వ్యాపారులకు లాభాలను తీసుకొస్తున్న మామిడి పరిశ్రమ రైతులకు మాత్రం నష్టాలనే కలిస్తున్నది. మామిడి రైతులు సకాలంలో సరియైన సమయంలో సమగ్ర పోషకాల యాజమాన్యం పద్ధతులు పాటించకపోవడంతోనే పూత, పిందె దశల్లో ఫలకతి సరిగా జరగక దిగుబడులు తగ్గి నష్టాలను చూడవల్సివస్తోంది. ప్రస్తుతం మామిడి తోటలు నిండుగా పూతతో పాటు, పిందెలను కల్గి ఉన్నాయి. మామిడి దిగుబడికి ఈ దశ చాలా ముఖ్యమైనది. ఈ దశలోనే మామిడి తోటల్లో ఆకుగూడు పురుగు, తేనె మంచు పురుగు వ్యాప్తించి పంటను పూర్తిగా నాశనం చేస్త్తుంది. రైతులు ఉద్యానవన అధికారుల సూచనలను పాటించకుండా మార్కెట్లో అధిక ధరలకు దొరికే నకిలీ మందులను కొనుగోలు చేసి మామిడి తోటలపై పిచికారీ చేస్తున్నారు. ఆకుగూడు పురుగు, తేనె మంచు పురుగు గమనించిన వెంటనే ఫ్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా క్లోరోపైరిపాస్ 2 మి.లీ లేదా ఇమామేక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా, అజాడిరక్టీన్ 1500 పీపీఎం 5 మి.లీ ఒక లీటర్ నీటికి కలిపి చెట్టు అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
పూతకు రెండు నెలల ముందు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురి చేయాలి. దీనివలన చెట్లు ఒకే మారు పూతకు వస్తాయి. ముఖ్యంగా పూమొగ్గల పెరుగుదల దశలో తేలికపాటి తడి ఇచ్చినట్లు అయితే త్వరగా పిందె కడుతుంది. పిందెలు బఠాణి, నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇచ్చినట్లైతే కాయ పరిమాణం బాగా పెరుగుతుంది. కాయ కోతకు 10నుంచి 15 రోజుల ముందు నీరు పెట్టడం నిలిపివేస్తే కాయ నాణ్యత పెరుగుతుంది. డ్రిప్ నీటి పారుదల పద్ధతి వలన మామిడి దిగుబడి పెరుగుతుంది.
మామిడి తోటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతి ముఖ్యమైనది. చెట్టు వయస్సును బట్టి ఎంత మోతాదు లో పశువుల ఎరువు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎ లా వేసుకోవాలో రైతులు తెలుసుకొని ఉంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. నత్రజనిని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇవ్వాలి. మిగిలిన 50 శాతం రసాయన ఎరువుల రూపంలో అందించాలి. కాపునకు రాని తోటల్లో ఉద్యానవన శాఖ అధికారులు సిఫారసు చేసిన ఎరువులను 2 నుంచి 3 నెలలకు ఒకసారి వేయాలి. మామిడి కోత అయిన వెంటనే 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగితా 1/3 ఎరువులను ఫిబ్రవరి 3వ వారంలో వేయాలి. తొలకరిలోనే జూన్, జూలై నెలల్లో జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను మామిడి చెట్ల మధ్యలో వేసి 45-50 రోజులలో కలియదున్నాలి. మామిడి తోటల్లో సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి.పశువుల ఎరువు, వర్మి కంపోస్టు ప్రతి చెట్టు పాదులో వేయాలి. పది సంవత్సరాలు పైబడిన చెట్లకు కిలో నత్రజని 2.2 కి లోల యూరియా, పొటాషియం 1.6 కి లో, ఒక కిలో భాస్వరం జూన్, జూలై నెలల్లో చెట్టు ప్రధాన కాండం నుంచి 2 మీటర్ల దూరంలో పాదులో వేయాలి.కాయలు నిమ్మకా య పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నై ట్రేట్ 10 గ్రాముల చొప్పున ఒక లీట రు నీటిలో కలి పి పిచికారీ చేయాలి.
కొల్లాపూర్ప్రాంతంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఇక్కడి భూమి స్వభా వం మామిడి తోటలకు అనుకూలంగా ఉంది. మామిడి రైతు లు ఉద్యాన అధికారు ల సూచనల ను పాటిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. రైతులు భూ యాజమన్య పద్ధతులను పాటించాలి.