మక్తల్ టౌన్, డిసెంబర్ 10 : మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాం గణం భక్తజనసంద్రంగా మారింది. ఆరో రోజైన శనివా రం అర్చకుడు ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉదయం ఆ లయంలో చక్రతీర్థ స్నానం, అశ్వవాహన సేవ, సా యంత్రం టేకు రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
ఆలయ వంశపారంపర్య ధర్మకర్త భీమాచారి మాట్లాడుతూ కొలిచిన భక్తుల కొంగు బంగారంగా స్వామి విరాజిల్లుతున్నాడన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మార్గశిర బహుళ విదియ రోజున భక్తులు స్వామికి తీపి వంటకాలతో నైవేద్యాన్ని సమర్చించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్యాంసుందరాచారి, భక్తులు పాల్గొన్నారు.