అలంపూర్, ఏప్రిల్ 19 : నియోజకవర్గంలోని అలంపూర్ మండలకేంద్రం, క్యాతూరు గ్రామంలో తెలంగాణ మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే విజేయుడు ప్రారంభించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 2,400 క్వింటాకు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేయుడు మొక్కజొన్న పంటకోసిన తర్వాత రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ ఏర్పాటు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోని మద్దుతు ధర పొందాలని సూచించారు. పంటలను అగ్ని ప్రమాదాలను నుంచి కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.