మక్తల్ టౌన్, నవంబర్ 28: మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతిఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి అన్నారు. జ్యోతిబాఫూలే వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం మక్తల్ మండలం ఉప్పర్పల్లి స్టేజీ వద్ద ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాఫూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.
మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ఫూలే తన సతీమణి సావిత్రీబాయిఫూలేను తొలి ఉపాధ్యాయురాలిని చేసి మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, నాయకులు రామలింగం, గవినోళ్ల నర్సింహారెడ్డి, ఉమాశంకర్గౌడ్, వల్లంపల్లి మధు, కర్రెం కృష్ణ, బండారి శేఖర్, ఎల్లలింగా, జుట్ల సాగర్, శివారెడ్డి తదితరులు ఉన్నారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, నవంబర్ 28 : జ్యోతిబాఫూలే 132వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో జేవీవీపీఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సత్యశోధక్ సంస్థను స్థాపించి మహిళలకు విద్యా ప్రాముఖ్యతను తెలియజెప్పిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని కొనియాడారు. ఫూలే ఆశయ సాధనకు యువత కృషి చేయాలని, అంటరానిత నం నిర్మూలన కోసం ప్రజలను చైతన్యపర్చాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేవీవీపీఎస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ, సామాజిక కార్యకర్త శ్రీనివాస్, అఖిల భారత అయ్యప్ప దీక్షా సేవాసమితి సభ్యుడు శ్రీనివాస్, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.