మహబూబ్నగర్, మార్చి 16 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూసుకుపోతున్నది. తెలంగాణ వచ్చాక పాలమూరు జి ల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2016లో జిల్లాల పునర్విభజన తరువాత మ హబూబ్నగర్ స్వరూపమే మారిపోయింది. రూ.వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ అర్బన్ ఎకోపార్కుకు బీజం పడింది.
రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి మెడికల్ కాలేజీ ఇక్కడికే మంజూరైంది. జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. జాతీయ రహదారులను అనుసంధానించడంతో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగమిస్తుంది. జిల్లా కేంద్రం సమీపంలో సుమారు 400 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో నీటి ఎద్దడే లేకుండా పోయింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ఎండాకాలంలోనూ జలకళ సంతరించుకుంటున్నా యి. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఊపందుకున్నాయి. విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలు ఊహించని రీతిలో పెరగడంతో వలసలు పోయినోళ్లందరూ వాపస్ వస్తున్నారు. ఇ ప్పుడు దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలే పాలమూరుకు వలస వస్తున్నారంటే పరిస్థితి ఊహించొచ్చు.
4 లక్షల ఎకరాల్లో సాగు..
గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు ల క్షల ఎకరాలు సాగైతే.. ప్రస్తుతం ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 3.86 లక్షల ఎకరాలు సాగవుతుండడం గమనార్హం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ, వాగుల్లో చెక్డ్యాంల ఏర్పాటుతో ఎక్కడికక్కడే జలసిరిని ఒడిసి పడుతున్నారు. దీంతో పాలమూరు పచ్చబడింది. వరి, జొన్న, కందులు, పొద్దుతిరుగుడు, పెసర, ఆముదం, పత్తి, మిరప, కూరగాయల సాగు విపరీతంగా పెరిగింది. ఇదంతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమే అని అంటున్నారు. భూగర్భజలాలు పెరగడంతో అనేక చోట్ల మూడు పంటలు సాగుచేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తున్నది.
జాతీయ రహదారులకు కేరాఫ్..
గతంలో పాలమూరుకు రావాలంటే రహదారులు సక్రమంగా ఉండేవి కావు. ఒక్కసారి వస్తే ఇక వద్దనుకునే వాళ్లు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని ఉ న్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ఎస్టేట్కు డిమాండ్ ఏర్పడింది. తాజాగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కూడా జాతీయ రహదారులకు అనుసంధానంగా మారింది. కోదాడ నుంచి రాయిచూర్ 167 హైవే, 167/1తో చించోలి హైవేలు పాలమూరుకు కనెక్టివిటీ అయ్యాయి. బైపాస్, హైదరాబాద్ తరహా రింగ్రోడ్డు నిర్మాణం కోసం భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
400 ఎకరాల్లో ఐటీ పార్కు..
వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పార్కుకు పచ్చజెండా ఊ పింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 400 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రీయల్ పార్కుకు బీజం పడింది. ఇటీవలే రూ.10వేల కోట్ల పెట్టుబడితో అమరాన్ బ్యా టరీ కంపెనీతో ఎంవోయూ కుదిరింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణం పూర్తయింది. మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
డబుల్బెడ్రూం ఇండ్లల్లో రికార్డు..
మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఇండ్లు నిర్మించడమే కాకుండా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లాకు 8,768 డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా, 7,341 ఇండ్లకు టెండర్లు వేసి.. 3,563 కంప్లీట్ చేశారు. మరో 1;459 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 125 గజాల్లో ఇండ్లు నిర్మిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వివాదాలకు తావు లేకుండా లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులకు అందించారు.
907 గ్రామాలకు తాగునీరు..
జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 907 గ్రామాల్లో 1,785 కిలోమీటర్ల పైప్లైన్ వేసి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. గతంలో గుక్కెడు నీటి కోసం ట్యాం కులు, నల్లాల వద్ద క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడేవారు. స్వరాష్ట్రం వచ్చాక ఆ పరిస్థితే లేదు. రూ.932 కోట్లతో అన్ని గ్రామాలకూ తాగునీరు అందుతున్నది. వాగులు, చెలిమెల వద్దకు వెళ్లే దృశ్యాలు కనుమరుగయ్యాయి. మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పంప్హౌస్ నిర్మాణం చేయడంతో జిల్లాకు సరిపడా నీళ్లను ఫిల్టర్ చేసి అందిస్తున్నారు.
ఎండాకాలంలోనూ జలకళ..
పాలమూరు అంటే కరువుకు కేరాఫ్గా ఉండేది. నెర్రలిచ్చిన నేలలు కనిపించేవి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మిషన్ కాకతీయ ద్వారా కనుమరుగయ్యాయి. చెరువులన్నింటినీ పునరుద్ధరించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఎండాకాలంలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చాలా చెరువులు ట్యాంకుబండ్లుగా మారాయి.
పర్యాటక సొబగులు..
పాలమూరు అంటే పిల్లలమర్రికి ఫేమస్.. కానీ ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలు పర్యాటక హబ్గా మారుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఎకోపార్కు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో మినీ శిల్పారామం, ట్యాంకుబండ్ పునరుద్ద్ధరణ హైలెట్గా మారబోతున్నాయి. సస్పెన్షన్ బ్రిడ్జి, బోటింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. దేవరకద్రలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. జడ్చర్లలో మినీట్యాంకుబండ్ ఇతర పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. మన్యంకొండ, కురుమూర్తి దేవాలయాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా మారాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో తలసరి ఆదాయంలో పోటీ పడుతున్నది. జడ్చర్ల జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ట్యాంకుబండ్ వద్ద జనం సేదతీరుతున్నారు. జిల్లా కేంద్రంలో కూడా ట్యాంకుబండ్కు పర్యాటక సొబగులు అద్దుతున్నారు. మినీ శిల్పారామం పూర్తికావచ్చింది.
మెడికల్ టూరిజం దిశగా..
రాష్ట్రం ఏర్పడ్డాక తొలి మెడికల్ కళాశాల పాలమూరుకే మంజూరైంది. రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించారు. ఈ కాలేజీతో మెడికల్ టూరిజం దిశగా అడుగులు పడుతున్నాయి. రూ.300 కోట్ల వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద వెయ్యిపడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నారు. ఫిజియెథెరపీ దవాఖాన, కళాశాల ప్రైవేట్ భాగస్వామ్యంతో వస్తుంది. ఇతర దేశాలకు చెందిన ఎక్స్పర్ట్లు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి గంటలో పాలమూరుకు వచ్చి వైద్యం చేసేలా మెడికల్ టూరిజంకు ఎన్ఆర్ఐలతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు ప్రారంభం కావడంతో వైద్యపరంగా హైదరాబాద్ను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా రూ.3.8 కోట్లతో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది.