పాలమూరు/మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 11 : సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయు ల్లో జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఫూ లే జయంతి సందర్భంగా మహబూబ్నగర్లో ఫూ లే విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మాజీ మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహు లు, ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ రవికిషన్రెడ్డి, నాయకులు నవకాంత్, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.