పాలమూరు, ఫిబ్రవరి 18 : మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పేదల తిరుపతిగా కొలిచే మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా 24న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. అమ్మవారి ఆ లయం నుంచి కొండ పైకి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.47లక్షలు, నీటి వసతికి రూ.64 లక్షలు కేటాయించి పనులు చేపట్టారు. ఆల య ప్రాంగణంలో దుకాణ సముదాయాలు, ముఖద్వారం, రెండో ఘాట్రోడ్డు నిర్మాణాల కు నిధులు మంజూరయ్యాయి. డబుల్ రోడ్డుతోపాటు కల్యాణ మండపం నిర్మించేందుకు నిధులు కేటాయించారు. కాగా, దేవస్థాన తా త్కాలిక ఉత్సవ కమిటీని శనివారం దేవాదా య శాఖ నియమించింది. గతంలో ఉన్న పా లకమండలి కమిటీ పదవీ కాలం పూర్తి కావడంతో తాత్కాలిక కమిటీ సభ్యులుగా గోవిం దు, ప్రభాకర్రెడ్డి, మోహన్రెడ్డి, వీరన్న, సురేందర్ను నియమించారు.
మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కావడంతో అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రకరకాల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా క్యూలు, వసతి సదుపాయం కల్పించారు. కోనేరును శుభ్రం చేసి శుద్ధజలంతో నింపి పైప్లైన్ షవర్లను ఏర్పాటు చేశారు. దాసంగం, విశ్రాంతి షెడ్లను సిద్ధం చేసి జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలను బిగించారు. భక్తులకు అత్యవసర చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ అన్నదాన సత్రంలో అన్నదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
సోమవారం తిరుచ్చిసేవ, మంగళవారం (20వ తేదీన) హంసవాహన సేవ, బుధవా రం (21న) గజవాహనసేవ, గురువారం (22న) సూర్యప్రభవాహనసేవ, శుక్రవారం (23న) హనుమత్వాహన సేవ, ప్రభోత్స వం, శనివారం (24న) గరుడవాహనసేవ, రథోత్సవం, ఆదివారం (25న) అశ్వవాహనసేవ, ద్వితీయ ప్రభోత్సవం, సోమవారం (26న) స్వామివారికి దర్బారు సేవ, మార్చి 2వ తేదీన శేషవాహనసేవ, 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మధుసూదన్కుమార్ తెలిపారు.