మహబూబ్నగ ర్ మెట్టుగడ్డ, మే 20 : మహబూబ్నగర్ నుంచి విశాఖపట్నం వరకు రైలు ను ప్రారంభించడం సంతోషం గా ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్లో పాలమూరు-విశాఖపట్నం వరకు నూతనంగా ప్రవేశపెట్టిన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (నం. 12862)ను శనివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మ హబూబ్నగర్ రైల్వేస్టేషన్ను అనేక మార్పులతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డబ్లింగ్ రైల్వేట్రాక్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. గత ఎన్నికల సమయం లో సుష్మాస్వరాజ్, మోదీ వెనుకబడిన జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇ చ్చి తుంగతలో తొక్కారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర మం త్రి కిషన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి జాతీయ హోదాతోపాటు నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు.
రైల్వే పరంగా ఈ ప్రాంతం ఇంకా ఎంతో అ భివృద్ధి చెందాల్సి ఉన్నదన్నారు.దేవరకద్రలో ఇటీవల ఆర్వోబీ ప్రారంభించాక రైల్వే గేట్ను పూర్తిగా మూసివేశారని, దీంతో బ స్టాండ్, దుకాణాలకు వెళ్లేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని తెలిపారు. వీరన్నపేటలో అండర్ బ్రిడ్జి, టీడీ గుట్ట వద్ద ైప్లెవర్ నిర్మించాల్సి ఉన్నదని అధికారుల దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. రైల్వేస్టేషన్కు ఎదురుగా ఉన్న మోతీనగర్లో 10 నుంచి 15 వేల మంది నివసిస్తున్నారని, రైల్వే ట్రాక్ దాటి కాలనీకి చేరుకోవడం గగనంగా మారిందన్నారు. తాగునీటి పైపులైన్ వేసేందుకు, రోడ్డు, డైనేజీ నిర్మాణినికి రైల్వే అధికారులు అడ్డు పడుతున్నారని, దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని చెప్పారు. మోతీనగర్ వాసులు భారతీయలు కాదా.. వీరి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో సమీక్ష ఏర్పాటు చేసి రైల్వే స మస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వస్తే.. సమస్యలపై ఆయనకు వివరించి పరిష్కరించే వీ లుండేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారం లో ఉన్నన్ని రోజులు ప్రజలకు మంచి పనులు చేయడమే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, డీఆర్ఎం శరత్ చంద్రయాన్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ బాధితులకు ప్లాట్లు, ఇండ్లు..
మహబూబ్నగర్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి స్థలాలు, ఇండ్లు కేటాయిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం ఏనుగొండ మై సమ్మ ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితుల వివరాలను సేకరించి.. వారికి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇ ప్పటివరకు బైపాస్ రోడ్డు, అప్పన్నపల్లి రెండో రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేశామన్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు జరుగుతున్న నాలుగులేన్ల పనుల్లో భాగంగా ఏనుగొండ వద్ద కొంతమేర పెండింగ్లో ఉందని, రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, కౌన్సిలర్లు కిశోర్కుమార్, అంజద్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.