మహబూబ్నగర్, జూలై 16 : సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ సెల్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు రాంకుమార్, శివతోపాటు పలువురు, పట్టణంలోని వేపూర్ గేరికి చెందిన మాజీ కౌన్సిలర్ గంజి యాదయ్య, గోనెల అశోక్, సంతోష్కుమార్, లక్ష్మీనారాయణ, బండ్లగేరికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేంద్ర, శరత్కుమార్ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా మహబూబ్నగర్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు. హైదరాబాద్కు దీటుగా మహబూబ్నగర్ అభివృద్ధిలో ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్నారు. ఇప్పటికే మహబూబ్నగర్లో తాగునీరు, రోడ్ల విస్తరణ, సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామన్నారు.
అండగా ఉంటాం..
హన్వాడ మండలం దాచక్పల్లి గ్రామానికి చెందిన అనుపాటి లక్ష్మమ్మ, వడ్డె బాలమ్మ, దయ్యాలమర్రి తం డాకు చెందిన తులసీబాయ్ కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా మంజూరైన రూ.15లక్షల (ఒక్కొక్కరికీ రూ.5లక్షలు) విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అం డగా ఉంటామన్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉం టుందని భరోసాను కల్పించారు. కార్యక్రమంలో హ న్వాడ ఎంపీపీ బాలరాజ్, ఎంపీటీసీ అరుణ్, సర్పంచ్ బాలకిష్టారెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు రమాణారెడ్డి, దినేశ్, హరిచందన్, చెన్నయ్య, గంగాపురి, మధు తదితరులు ఉన్నారు. అనంతరం షాషాబ్గుట్టకు చెందిన కొండయ్య అనారోగ్యంతో హైదరాబాద్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ దవాఖానకు వెళ్లి కొండయ్యను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు.