ఊట్కూర్, జూన్ 30: గురువారం వెలువడిన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండల వ్యాప్తంగా 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలో మొత్తం 573 మంది విద్యార్థులకుగానూ 547 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మండలకేంద్రానికి చెందిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి అశోక్ 9.7 జీపీఏ సాధించి మండల టాపర్గా నిలిచాడు.
బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని 9.5 జీపీఏతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఉర్దూ మీడియంలో విద్యార్థి ముస్కాన్ 9.2 జీపీఏతో మండల టాపర్గా నిలిచాడు. ఫలితాలపై తపస్, పీఆర్టీయూటీఎస్ జిల్లా, మండల నాయకులు లక్ష్మారెడ్డి, సత్యపాల్, భాస్కర్, నర్సింహ, నర్సింగప్ప, వెంకట్రాములు, కృష్ణ తదితరులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. తపస్ ఆధ్వర్యంలో మండల టాపర్లను ఘనంగా సత్కరించారు.