ఊట్కూర్, జూన్ 28 : రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడి గా నిలిచారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం స్థానిక రైతు వేదిక భవనంలో రైతులకు ఉచితంగా కంది విత్తన ప్యాకెట్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. రైతులకు దళారుల బెడద లేకుండా పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందన్నారు. రైతుల బా గోగులు పట్టని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించబోమని హెచ్చరించారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఎమ్మె ల్యే చిట్టెం రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి రోజూ ఎకరం భూమి ఉన్న వారికి, రెండోరోజూ రెండెకరాల లోపు వారికి, మూడోరోజూ మూడెకరాల లో పు వారికి ఇలా రోజూ ఆయా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేస్తుందన్నారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న రైతుబంధు పథకం ఈ సీజన్లో పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బా ల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఏవో గణేశ్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి
మక్తల్ టౌన్, జూన్ 28 : విశ్రాంత ఉపాధ్యాయుల సే వలు మరువలేనివని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో రాష్ట్ర విశ్రాంత ఉపాధ్యాయులు సంఘం మండలాధ్యక్షుడు గోపాలం ఆ ధ్వర్యంలో 400 గజాల స్థలాన్ని విశ్రాంత ఉపాధ్యాయుల మండల సంఘానికి కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెంను విశ్రాంత ఉపాధ్యాయుల మండల సంఘం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చిట్టెం మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. స్థలం కోసం పూర్తి సహకారం అందిస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భాస్కర్, సభ్యులు పాల్గొన్నారు.
సీఐ సీతయ్యకు సన్మానం
పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పీవీ నర్సింహరావు ప్రైడ్ ఇండియా సేవ పురస్కారం డాక్టరేట్ అవార్డు అందుకున్న సీఐ సీతయ్యను ఎమ్మెల్యే సన్మానించారు. సీఐ సీ తయ్య చేసిన సేవలకుగానూ పురస్కారం లభించడం చాలా ఆనందంగా ఉందని ఎ మ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఊట్కూర్ జెడ్పీటీసీ అశోక్, మాగనూర్ టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు రూ.రెండు లక్షల బీమా
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు రూ. రెండు లక్షల జీవిత బీమా సీఎం కేసీఆర్ కల్పించారని ఎ మ్మెల్యే చిట్టెం అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పారేవుల గ్రామానికి చెందిన ఎం.చెన్నప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరైన రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కుటుంబ సభ్యులకు మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ భరో సా కల్పించేందుకు రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్ కల్పించిందన్నారు. పార్టీ నమ్ముకొని పని చేసిన కార్యకర్తలకు అండగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాప్రాంగణాల ప్రారంభం
నర్వ, జూన్ 28 : మండలంలోని జక్కన్నపల్లి, పాతర్చేడ్, సీపూర్ తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రా మీణ క్రీడాప్రాంగణాలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, జెడ్పీటీసీ గౌని జ్యోతిరెడ్డి, వైస్ఎంపీపీ వీణవతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.