మహబూబ్నగర్టౌన్, జూన్ 23 : మహబూబ్నగర్ సుందరీకరణకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 47వ వార్డు వివేకానందనగర్లో రూ.18లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహబూబ్నగర్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదన్నారు. 2014 కంటే ముందు మహబూబ్నగర్ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. పెద్దచెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం 24గంటలు పనులు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే రోడ్డు విస్తరణతోపాటు చౌరస్తాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులను చేపడుతున్నామని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ గోవిందు, నాయకులు సత్యం, శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.