మక్తల్ టౌన్, జూన్ 23: నియోజకవర్గ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ మున్సిపాలిటీలోని రాయిచూర్ రోడ్డు ఏడోవార్డులో హైవేనుంచి ఈద్గాకు వెళ్లే రోడ్డు ను రూ.పది లక్షల ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉన్నా నియోజక వర్గ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతానని తెలిపారు. మున్సిపాలిటీ ఆ దాయం పెంచుకునే దిశగా అధికారులు అడగులు వేయా లని సూచించారు. కౌన్సిల్ సభ్యులందరూ కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నారు.మున్సిపాలిటీ కేంద్రంలో రూ.36 కోట్లతో నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేయబోతున్నామని, అదేవిధంగా నియోజకవర్గంలో మూడు జూనియర్ కళాశాలలు తీసుకొచ్చామని, మక్తల్ పట్టణం లో డిగ్రీ కళాశాలను త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్గౌడ్, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఏఈ నాగశివ, శాలం, శంషొద్దీన్, చీరాల సత్యనారాయణ, సాగర్, వసీం తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారుల ఎంపిక గర్వకారణం
గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలోని మినీస్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందమంది విద్యార్థులతో కలిసి ఒలింపిక్డే పరుగులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ మక్తల్ పురవీధుల గుండా క్రీడాజ్యోతిని పట్టువిద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చిట్టెం ఒలింపిక్న్ల్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం, సమాజంలో గౌరవం కలిగిస్తాయని, క్రీడలతో బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. నర్సింహాగౌడ్, ఒలింపిక్ పరుగు కన్వీనర్ బి గోపాలం, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సత్య, ఆంజనేయులు, అంజయ్య, దామోదర్, అమ్రేశ్, రమేశ్, స్వప్న, సుష్మ, రాంచందర్, జయమ్మ, సువర్ణ, అనిత, జమున, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.
రైతుల అవసరాలకే మొదటి ప్రాధాన్యత
ప్రజల ఆకలిని తీర్చే రైతన్నల వ్యవసాయ పనులకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభు త్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఆహారభద్రత మిషన్ నుంచి ఉచితంగా మంజూరైన కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభు త్వం రైతుబంధు, ఉచిత కరెంట్, ఉచితంగా విత్తనాల పంపిణీ, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం లాంటి పథకాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, జెడ్పీటీసీ గౌనిజ్యోతిరెడ్డి, వైస్ఎంపీపీ వీణవతి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మండ్ల చిన్నయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ సి బ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం
కేంద్రంలోని వ్యవసాయశాఖ జాతీ య ఆహార భద్రత మిషన్ ద్వారా రైతులకు కందులు మినీ కిట్లు ఉచితంగా ఇస్తున్నది. కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు కందులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు జెడ్పీటీసీ వెంకటయ్య, వైస్ఎంపీపీ తిప్పయ్య గ్రామస్తులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.