నారాయణపేటరూరల్, జూన్ 23: కళాశాలల్లు, పాఠశాలల్లు, బస్టాపుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ఎవరైన విద్యార్థినులను ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని షీటీం ఇన్చార్జ్ ఎస్సై సుధామాధురి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని హంసవాహిని ఉన్నత పాఠశాల, దయానంద విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్ వినియోగం ఎక్కువగా చేస్తున్నారని, సోషల్ మీడియాకు అలవాటుపడి సమయం వృథా చేస్తున్నారన్నారు. వెంటనే వాటిని తగ్గించుకోవాలన్నారు. విద్యార్థినులు పాజిటివ్ ఆలోచనలతో జీవితంపై ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకొని ఏదైనా ఉద్యోగం సాధించాలన్న టార్గెట్ పెట్టుకొని చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎవరైనా విద్యార్థినులను ఈవ్టీజింగ్, ర్యాగింగ్, వేధింపులకు గురిచేస్తే వెంటనే షీటీం హెల్ప్లైన్ నెంబర్ 7901022492 కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో షీటీం పోలీసులు మమత, బాలరా, లాయక్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.