ఊట్కూర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఊట్కూర్, నిడుగుర్తి, బిజ్వారం, పెద్దపొర్ల, పులిమామిడి గ్రామాల్లో విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొని యోగాభ్యాసం చేశారు. స్థానిక జెడ్పీ బాలుర ఉ న్నత పాఠశాలలో యోగా మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు సురే శ్ విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించి మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కోస్గి మండలంలో…
కోస్గి, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా చేశారు. లక్ష్మీవేంకటేశ్వరస్వామి, శివసాయి అయ్యప్ప ఆలయం వారి ఆధ్వర్యంలో పట్టణంలో మం గళవారం యోగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయ ఆ వరణలో యోగాభ్యాసం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో…
మక్తల్ రూరల్, జూన్ 21 : మండలంలోని పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ యోగా ది నోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ధ్యానం, యోగాభ్యాసం చేశారు. అలాగే వివిధ రకాల వ్యాయామాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
కృష్ణ, జూన్ 21 : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నిజాముద్దీన్ మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి యోగా టీచర్లు ఎస్.కే రంగారావు, టి.రేణుక హాజరై వి ద్యార్థులతో ఆసనాలు వేయించారు. ఆరోగ్యవంతమైన సమా జం కోసం ప్రతిఒక్కరూ రోజూ యోగా చేయాలని టీచర్లు సూ చించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరికల్ మండలంలో…
మరికల్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలతోపా టు అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లోని విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. యోగాతో శారీరక దారు ఢ్యం పెరుగుతుందని యోగా గురువు అన్నారు. అందుకు ప్రతిరోజూ యోగ చేయాలన్నారు.
చదువుతోపాటు ఆరోగ్యం అవసరం
నారాయణపేట టౌన్, జూన్ 21 : నేటి కాలంలో విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం కూడా అవసరమని అదనపు క లెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ, యువజన క్రీడా శాఖ సంయుక్తంగా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాని కి ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి యువత చెడు వ్యసనాల కు బానిస అవుతున్నారని, తల్లిదండ్రులు వారిని యోగా శిక్షకు ల దగ్గరకు తీసుకెళ్లి సన్మార్గంలో మరలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో రోజూ 30నిమిషాలు యోగాకు కేటాయించాలన్నా రు. అనంతరం యోగా నిపుణులు, విద్యార్థులతో కలిసి ఆసనా లు వేశారు. కార్యక్రమంలో డీఈవో లియాఖత్ అలీ, ఏఎంవో విద్యాసాగర్, డీవైఎస్వో సిబ్బంది సాయినాథ్, పీఈటీలు, వస తి గృహాల విద్యార్థులు పాల్గొన్నారు.
సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో…
పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో అం తర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్ఎం దత్తూచౌదరి యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వి ద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు రోషనప్ప, అరవింద్, మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పా ల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ యోగా దినోత్స వం ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీవసంత, ఎన్సీసీ అధికారి శంకర్, ఎన్ఎస్ఎస్ అధికారులు భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
నారాయణపేట, జూన్ 21 : నిత్యం యోగా చేయడం వల్ల తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయస్థానం, లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శుభవల్లి, జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, ప్ర ధానకార్యదర్శి సలీం, ఉపాధ్యక్షుడు నందూనామాజీ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలి
యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో తెలంగా ణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. వేసవిలో ఒక నెల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు సర్టిఫికెట్స్ ప్ర దానం చేశారు. కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ సభ్యు లు, పతంజలి యోగా సమితి సభ్యులు పాల్గొన్నారు.
యోగాతో మానసిక పరిపక్వత
మక్తల్ టౌన్, జూన్ 21 : యోగాతో మానసిక పరిపక్వత, మనసుకు ప్రశాంతత ఇస్తుందని బ్రహ్మకుమారి సంతోషి అన్నా రు. పట్టణంలోని మినీ స్టేడియంలో టగ్ ఆఫ్ వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బి గోపాలం, సత్యాంజనేయులు, పీఈటీ బాలరాజు, భాస్కర్రెడ్డి, సువర్ణ, జయమ్మ, సుష్మ, రాములు, మంజుల, ఇందు తదితరులు పాల్గొన్నారు.