నాగ్కర్నూల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : కులవృత్తులకు సీఎం కేసీఆర్ నా యకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చే యూతనందిస్తున్నది. దళితులకు దళితబం ధు, రైతులకు రైతుబీమా, రైతుబంధు, చేనేత, బీడీ కార్మికులకు ఆసరా, చేపల పం పిణీతో ముదిరాజ్ కులస్తులకు, నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కాగా, బీసీల్లో అధికం గా ఉన్న గొల్లకురుమల కోసం గొర్రెల పం పిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. కుటుంబంలో ఎంత మంది అర్హులున్నా కాపర్లను లబ్ధిదారులు గా లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఇలా తొలి విడుతలో గొర్రెల పంపిణీ చేపట్టింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలతో గొ ర్రెల పంపిణీ పథకం అమలులో జాప్యం జరుగుతూ వచ్చింది. తొలి విడుత పూర్తయ్యాక గద్వాలతోపాటు ఇతర జిల్లాలో రెండో విడుదల కోసం లబ్ధిదారుల నుంచి డీడీలు కూడా సేకరించడం పూర్తయ్యింది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గొర్రెల కాపర్ల నిరీక్షణ వచ్చే నెలలో పరిసమాప్తి కానున్నది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) గొర్రెల పంపిణీకిగానూ ఇటీవల రుణ మంజూరుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి సానుకూలత ఏర్పడింది.
ఈ క్రమం లో ఉమ్మడి పాలమూరులోని దాదాపుగా 70 వేల మందికి పైగా కాపర్లు రెండో విడుతలో లబ్ధి పొందనున్నారు. గ్రామీణ ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న కాపర్లకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనున్నది. ఇందులో అర్హులను తాసిల్దార్, ఎంపీడీవో, వెటర్నరీ అధికారులుగా ఉన్న కమిటీ గ్రామాల్లో సభలు నిర్వహించి లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నది. పథకం ప్రారంభించి నాలుగేండ్లు దాటడంతో యూనిట్ విలువ రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు చేరుకున్న ది. ఇందులో లబ్ధిదారులు తమ వాటాగా రూ.42,500 డీడీ రూపంలో చెల్లిస్తే మిగిలిన డబ్బులను ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుంది.
ఈ పథకం కోసం ఇప్పటికే డీడీలు కట్టిన జోగుళాంబ గద్వాల జిల్లా కాపర్లతోపాటు మిగిలిన జిల్లాల కాపర్లు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీని పై వచ్చే నెలలో స్పష్టత రానున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 19,253 మంది గొర్రెల కాపర్లను గుర్తించి 324 గ్రామాల్లో 4,01,137 గొర్రెలు, 19,127 మంది గొ ర్రెల కాపర్లకు పంపిణీ చేశారు. ఈ గొర్రెలకు జిల్లాలో మరో 1.50 లక్షల పిల్లలు పుట్టాయి. ఈ జీవాల పరిరక్షణకుగానూ దాణా, ైస్టెలో విత్తనాలు, పీసీ-23 విత్తనాలు సరఫరా చేశారు. అలాగే పశుగ్రా సం, ఇన్సూరెన్స్ చేయించడం, మం దులను అందించారు. ఇలా జీవాలను పంపిణీ చేయడంతోపాటు పరిరక్షణకు ప్రభుత్వమే ప్రత్యేకంగా పలు సదుపాయాలను కల్పించడం గమనార్హం.
మొత్తమ్మీద వచ్చే నెలలో పంపిణీ జరిగే అవకాశముండడంతో కాపర్లలో హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ ఆదేశంతో పంపిణీ..
ఎన్సీడీసీ నిర్ణయంతో రెండో విడుత గొర్రెల పంపిణీకి అవకాశం ఏర్పడింది. నెల రోజుల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రెండో విడుత పంపిణీకి ఏర్పాట్లు చేపడతాం. కొద్ది రోజుల్లోనే పంపిణీ, మార్గదర్శకాలపై స్పష్టత వస్తుంది.
– రమేశ్, జిల్లా పశువైద్యాధికారి, నాగర్కర్నూల్
సీఎం కేసీఆర్ కాపర్లకు దేవుడు..
మొదటి విడుత గొర్రెల పంపిణీ విజయవంతంగా జరిగింది. ఎన్సీడీసీ రుణ మంజూరు అనుమతి కోసం సీఎం కేసీఆర్ ఆదేశంతో రాష్ట్రం పది నెలలుగా పలు దఫాలుగా ప్రయత్నాలు చేపట్టింది. ఇటీవలే రుణ మంజూరుకు ఎన్సీడీసీ అనుమతించింది. త్వరలో రుణాల ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో గొర్రెల పంపిణీ చేస్తాం. సీఎం కేసీఆర్ బీసీలకు గొర్రెల కాపర్లకు దేవుడిలా మారారు.
– బైకని శ్రీనివాస్ యాదవ్, గొర్రెల ,పెంపకందారుల సహకార సంఘం మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి