మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 21 : యోగాతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందన్నారు. దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ వంటి వ్యాధులు నయమవుతాయన్నారు.
జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పేలా చర్యలు తీసుకోవాలనారు. అన్ని వార్డుల్లో పార్క్లతోపాటు, పది వరకు యోగా షెడ్లు ఏర్పాటు చేస్తామని, ఎంవీఎస్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న స్టేడియంలో కూడా షె డ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్ సుజాత, ఆదిశేషయ్య, నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ కోట నాయక్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీ నివాస్, ముడా చైర్మన్ వెంకన్న, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, ప్రసాద్, అడ్వకేట్ మనోహర్రెడ్డి, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పాండురంగం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్, ప్రజాప్రతినిధులు, యోగా గురువులు వెంకట్రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.