శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
వనపర్తి, మే 24 : తన కుటుంబం బాగుంటే చాలు.. పక్కవాడికి ఏమైతే ఏంటి అనుకుంటున్న సమాజంలో సాయం చేయాలన్న ఆలోచనను విస్మరిస్తున్నారు. రూపాయి సాయం చేసి రూ.వంద పబ్లిసిటీ కోరుకునే రోజుల్లో కూడా ఎంతో మందికి ఇటు సాయం చేస్తూనే.. అటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారిని అరుదుగా చూస్తుంటాం. ఎన్నో కష్టనష్టాలను చవి చూసి.. స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగి పది మందికి ఉపాధి కల్పించాలని వనపర్తికి చెందిన తిరుమల మహేశ్ పరితపిస్తున్నారు. ఉన్న దానిలో తన వంతుగా సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనల నుంచి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
2016లో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన తిరుమల సరస్వతి డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేశ్ ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆలయాల అభివృద్ధికి, పేదింటి ఆడబిడ్డలకు పుస్తె, మెట్టెలు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరు విద్యార్థుల చదువుకు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం, పేదలకు వైద్య శిబిరాలు, వృద్ధ్దాశ్రమంలో ఆహారం, దుప్పట్లు, కనీస సౌకర్యాల కల్పన వంటివి చేపడుతున్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తన కష్టాన్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అపజయాలను విజయాలుగా మార్చుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు..
సాయం చేయడంలోనే ఆనందం..
పక్కవాడికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. ప్రజలకు నా వంతుగా సేవ చేయాలన్న లక్ష్యంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాను. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నా. నేరరహిత సమాజం కోసం పోలీసులు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నా వంతుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా. జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నాను. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాను.
– తిరుమల మహేశ్, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చారిట్రబుల్ ట్రస్టు అధినేత