మహబూబ్నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా- వికారాబాద్, గద్వాల- మాచర్ల రైల్వే లైన్ల నిర్మాణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఊసే ఎత్తలేదు..ఇటీవల ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సైతం కనీసం రైల్వే లైన్ అంశాలపై స్పందించలేదు..కేంద్రం నుంచి రాష్ర్టానికి ఏం తెస్తారో.. ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయో యాత్రను అనిపించారు. దేశాన్ని పాలించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి అందించే ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలపై మాట్లాడకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఏం చేశాడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసినప్పుడు ఇక్కడి రైల్వే లైన్ల అంశం గుర్తుకు రాలేదా..? కనీసం ఒక్క ప్రాజెక్టుపై కూడా స్పష్టత ఇవ్వకుండా యాత్రలు ఎందుకని చర్చించుకుంటున్నారు.
పాదయాత్ర పేరిట నెల రోజులపాటు ఉ మ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో షో చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూ రు ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తాడో, ఏం చేస్తాడో మాత్రం చెప్పకుండానే రెచ్చగొట్టే ప్రసంగాలతో ముగించాడు. కానీ ఉమ్మడి జి ల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కృష్ణా-వికారాబాద్, గద్వాలమాచర్ల రైల్వేలైన్ గురించి కనీసం ప్రస్తావించలేదు. అత్యంత వెనకబడిన ప్రాం తంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పకుండానే పాదయా త్ర ముగించాడని స్థానికులు పేర్కొంటున్నా రు. నిజాం పాలన నుంచి ప్రతిపాదనల్లో ఉ న్న గద్వాల-మాచర్ల రైల్వేలైన్ గురించి కేం ద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోవడంలే దు. అలాగే 40 ఏండ్లుగా ప్రజలు కోరుతున్న కృష్ణా-నారాయణపేట-వికారాబాద్ రైల్వేలైన్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఈ రెండు రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో రైల్వే నెట్వర్క్ ఏర్పడి అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
కృష్ణా-వికారాబాద్ ఊసేలేదు..
అత్యంత వెనుకబడిన ప్రాంతమైన నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు పరిగి, కొ డంగల్, మక్తల్ నియోజకవర్గాలకు రైల్వేలైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే కృష్ణా-వికారాబాద్ రైల్వేలైన్ కోసం ప్రజలు 40 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. పలుమా ర్లు సర్వే చేసినా ఫలితం మాత్రం లేదు. గుంతకల్-రాయిచూరు-వాడి సెక్షన్లో ఉన్న కృష్ణా రైల్వేస్టేషన్ నుంచి మాగనూరు, మక్తల్, ఊ ట్కూరు, నారాయణపేట, మద్దూరు, కోస్గి, పరిగి మీదుగా వికారాబాద్కు రైల్వేలైన్ వే యాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నది. ఈ రైల్వేలైన్తో రాయిచూరు నుంచి వాడి వెళ్లి సికింద్రాబాద్ వెళ్లే అనేక రైళ్లను నారాయణపేట, పరిగి, వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు మార్గం సుగమవుతుంది.
ఇలా చేస్తే నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు మక్తల్, పరిగి నియోజవర్గ కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ రైల్వేలైన్తో రాయిచూరు నుంచి వికారాబాద్, సికింద్రాబాద్ వెళ్లేందుకు సమయం ఆదా అవ్వడమే కాకుండా దూరం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్లో భాగంగా దేవరకద్ర నుంచి కృష్ణా వరకు రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులు కూడా పూర్తవుతాయి. వికారాబాద్ నుంచి మక్తల్ వరకు రైల్వేలైన్ వేస్తే మక్తల్ నుంచి కృష్ణా వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్న రైల్వేలైన్ ద్వారా రాకపోకలకు అవకాశం ఉంటుంది. కేంద్రం ఈ అంశంపై దృష్టి సారిస్తే మరో కొత్త రైల్వేలైన్కు అవకాశం ఉంటుంది.
ఉట్టి పాదయాత్రలే..
పాదయాత్రల పేరిట ప్రజల్లోకి వచ్చిన బం డి సంజయ్.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన ప్రాజెక్టులను తీసుకురావడంలో తమ బాధ్యతను మాత్రం మరిచారని స్థానికులు అంటున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాం తంలో పాదయాత్రలకు వచ్చిన బండికి ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు ఏవో కూడా తెలియదా అని అంటున్నా రు. కృష్ణా-వికారాబాద్, గద్వాల-మాచర్ల రై ల్వేలైన్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎందుకు స్పందించడం లే దని ప్రశ్నిస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు ఈ విషయంలో రాష్ట్రం, కేంద్రంలోని వారి పార్టీ నేతలపై ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారని, పాదయాత్రలు చేసినప్పుడు రైల్వేలైన్ల అంశం గుర్తుకు రాలేదా అని విమర్శిస్తున్నారు.
కొత్త జిల్లా కేంద్రాలకు రైల్వే సౌకర్యం కరువు
రాయిచూరు నుంచి గద్వాల, కొత్తకోట, వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, నాగార్జున సాగర్ మీదుగా మాచర్ల వరకు రైల్వేలైన్ నిర్మించాలని ప్రతిపాదించి పలుమార్లు సర్వే కూడా చేశారు. రాయిచూరు నుంచి గద్వాల వరకు రైల్వేలైన్ పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించి.. దాదాపు 10 ఏండ్లు గడుస్తున్నా నేటికీ గద్వాల-మాచర్ల రైల్వేలైన్ ఊసేలేదు. రాయిచూరు నుంచి గద్వాల వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు.
గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వే మార్గం ఏర్పడితేనే తూర్పు, పశ్చిమ దేశాన్ని కలిపే అవకాశం ఉండేది. ఈ రైల్వేలైన్ వల్ల నూతనంగా ఏర్పాటైన వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు రైల్వే సదుపాయం కలిగేది. వెనుకబడిన జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కని రైల్వే నెట్వర్క్ ఏర్పాటై అభివృద్ధికి ఊతముండేది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
గద్వాల-మాచర్ల లైన్ను పట్టించుకోని కేంద్రం
గద్వాల-మాచర్ల రైల్వేలై న్ ప్రతిపాదనలకే పరిమితమైంది. 1990లో ఈ లైన్ ను ప్రతిపాదించారు. నేటి వరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిధు లు కేటాయించలేదు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలు అభివృద్ధి చెందే అ వకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. విజయవాడ, గుంటూరు, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేందుకు సులువుగా ఉంటుంది.
గద్వాల-మాచర్ల రై ల్వేలైన్కు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తుందని సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదించినా.. మోడీ సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అధికారంలోకి వచ్చిన వారంతా రైల్వేలైన్ పనులు ప్రారంభిస్తామని చెప్పడమే తప్పా చేసిందేమీ లేదు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ రైల్వేలైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. రైల్వే మంత్రిత్వశాఖపై ఎంపీలు పార్టీలకతీతంగా ఒత్తిడి పెంచాలి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రానికి పూర్తి నివేదికివ్వాలి.
– మధుసూదన్బాబు, న్యాయవాది, గద్వాల
ఉచిత శిక్షణ ఇస్తున్నాం..
కింగ్షోటోకాన్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నాం.
కరాటేతోపాటు యోగా, కిక్బాక్సింగ్, కొత్తగా విద్యార్థులకు కర్రసామును నేర్పిస్తున్నాం. ఇతర జిల్లాల నుంచి కర్రసాముపై అవగాహన కల్పించేందుకు శిక్షకుడితో
వివరిస్తున్నాం. చాలా మంది చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
– జహంగీర్పాషా ఖాద్రీ, కింగ్ షోటోకాన్ క్లబ్ఫౌండర్