అచ్చంపేట, మే 23 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లోకి పంపుతుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు అన్నారు. సోమవారం అచ్చంపేట టీఎన్జీవో భవనంలో మహబూబ్నగర్ జిల్లా 15వ మహాసభలు నిర్వహించారు. ఈసభకు ఎండీ సుభాను అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మేధావులు, హక్కుల సంఘాల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ జైల్లో నిర్భందిస్తున్నారన్నారు.
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, వరవరావు, ఆనంద్తేల్మ్రాంద్దె, సోమాసేన్, రోనాయిల్సన్తోపాటు మారో 15 మంది హక్కుల కార్యకర్తలను విచారణ లేకుండా జైల్లో నిర్భందిస్తున్నారని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలపై విపరీతమైన పన్నుల భారం వేస్తూ ప్రజలు జీవించే హక్కు లేకుండా కాలరాస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ యువకుల జీవానోపాధి హక్కును కేంద్రం హరిస్తుందన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు, హక్కుల సంఘం కార్యకర్తలు, మేధావులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.