నారాయణపేట రూరల్, మే 23 : ప్రశాంత వాతావరణంలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 235 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 47,063 మంది విద్యార్థులు హాజరుకాగా 663 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. అధికారులు కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలో పదో తరగ తి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రెండేండ్ల త ర్వాత నిర్వహిస్తున్న పరీక్షలకు అధికారులు పకడ్బందీగా చ ర్యలు తీసుకున్నారు. తొలిరోజూ జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో 8,067 మంది రెగ్యులర్ విద్యార్థులకుగా నూ 7,951 మంది హాజరు కాగా, 116 మంది గైర్హాజరయ్యారు.
అలాగే 3 ముగ్గురు ప్రైవేట్ విద్యార్థులకు గానూ ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. జిల్లాలో 38 కేంద్రాలకుగానూ 37 రెగ్యులర్, ఒకటి ప్రైవేట్ పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ నిఘాలో పరీక్షలు నిర్వహించినట్లు డీఈవో లియాఖత్ అలీ తెలిపా రు. ఉదయం 9ః30 నుంచి మధ్యాహ్నం 12ః45 గంటల వరకు పరీక్ష ఉండగా, గంట ముందే విద్యార్థులు కేంద్రాల కు చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, షామియానాలతోపాటు పారదర్శకత కోసం అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు అమర్చారు.
ఆయా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశా రు. అలాగే అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించారు. కేంద్రాల వద్ద వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ కా ర్యకర్తలు మెడికల్ కిట్లను అందుబాటు లో ఉంచారు. పేటలోని గురుకుల, సిం గారం చౌరస్తాలోని గురుకుల, మరికల్లోని గురుకుల పాఠశాలలోని విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు పాఠశాల నుంచి కేంద్రాల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
విద్యార్థులను కేంద్రాల వద్దకు తీసుకెళ్లి మళ్లీ పరీక్షలు ముగిసిన తర్వాత వారి వారి పాఠశాలల్లో వదిలిపెట్టారు. జిల్లాలోని కాన్కుర్తి, మ ద్దూర్లోని బాలుర, బాలికల, ఉర్దూ, గీతాంజలి పరీక్షా కేం ద్రాలను స్కాడ్స్ బృందం, పేటలోని బాలికల, నారాయణ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పరీక్షలకు 38 మంది సీఎస్లు, డీవోలు, 415 మంది ఇన్విజిలేటర్లు, ఫ్ల యింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటర్ అధికారులు పరక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
పది పరీక్షలు జాగ్రత్తగా ని ర్వహించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. జిల్లాకేంద్రంలో ని లిటిల్స్టార్, బ్రిలియంట్ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాల ను కలెక్టర్ హరిచందన ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని డీఈ వో లియాఖత్ అలీకి సూచించారు. అక్కడే ఉన్న అధికారులతో విద్యార్థులు హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నా రు.
పరీక్షలు ముగిసే వరకు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా కేంద్రాలకు సెల్పోన్లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రశ్నాపత్రం లీక్కాకుం డా రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో లియాఖత్ అలీ, యాదయ్యశెట్టి, ఆర్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గ్గొన్నారు.