అయిజ, మే 23 : కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభ ద్ర జలాశాయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, అకాలవర్షాల కారణంగా కర్ణాటకలోని ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంటే, శృంగేరి, చిక్మగళూర్, వరనాడులో భారీగా కురుస్తు న్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో టీబీ డ్యాంకు ఇన్ఫ్లో చేరుతున్నది. సోమవారం ఇన్ ఫ్లో 38,890 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 359 క్యూసెక్కులు నమోదైం ది. టీబీ డ్యాం100.855 గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యానికిగానూ, ప్రస్తుతం 31.184 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మ ట్టానికిగానూ, ప్రస్తుతం 1607.78 అ డుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాంసెక్షన్ అధికారి విశ్వనాథ్లు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 1585.83 అడుగుల తో 7.067 టీఎంసీల నీరునిల్వ ఉంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన వరుణుడు కరుణించడంతో వరద నీరు తుంగభద్ర నదిలోకి చేరుతున్నది. సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 5,455 క్యూసెక్కులు ఉండగా, 655 క్యూసెక్కులు ఆర్డీఎస్ ప్రధానకాల్వకు విడుదల చేస్తుండగా, 4,800 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీకి చేరుతోంది. ఎగువన వర్షం మోస్తరులో కురుస్తుండటంతో వరద తగ్గుతోందని ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు.