నారాయణపేట టౌన్, మే 23 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదన పు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం అ ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రెండేండ్లు నిడారంబరంగా జరుపుకొన్నామని పేర్కొన్నారు. ఈసారి పతాకావిష్కరణకు ముఖ్య అతిథులు వస్తున్నారన్నారు. తె లంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 8 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందన్నారు. పరేడ్ గ్రౌండ్లో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్లో ముఖ్యఅతిథికి గౌరవ వందనం, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, అనంతరం పతాకావిష్కరణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశం లో అదనపు ఎస్పీ భరత్, జిల్లా అధికారులు వీణావాణి, జాన్ సుధాకర్, గోవిందరాజన్, వెంకటేశ్వర్లు, హతీరాం, కన్యాకుమారి, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.