మద్దూర్, మే 20 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారి లో రాజేశ్రాథోడ్, రాజేందర్నాయక్, రవినాయక్తోపాలు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, సర్పంచుల సం ఘం జిల్లా అధ్యక్షుడు పెద్ద వీరారెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు వెంకటయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు హన్మిరెడ్డి, బసిరెడ్డి, రాములు, బొబ్బిలి తిరుపతిరెడ్డి, రాములుగౌడ్, నర్సింహులు పాల్గొన్నారు.