మక్తల్ రూరల్, మే 20 : మండలంలోని రామసముద్రంలో ఆంజనేయస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం, ధ్వజస్తంభాన్ని శుక్రవారం ఘ నంగా ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆంజనేయులుగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపాన్ని ఆమె ప్రారంభించారు. భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాలను పం పిణీ చేశారు. కార్యక్రమంలో మాదన్పల్లి సర్పంచ్ మంజుల, నాయకులు లింగారెడ్డి, తిరుపతయ్య, బస్వరాజ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.