కోస్గి, మే 20 : సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలు గ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రై తు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మి షన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బల్దియా లో ఎక్కడ కూడా నీటి సరఫరాకు అంతరాయం కలుగొద్దని, పనులు పెండింగ్లో ఉండకూడదన్నారు. పట్టణంలో ని 16 వార్డుల పనులను పరిశీలించాలని మిషన్ భగీరథ ఎస్సీ వెంకట్మ్రణను ఆదేశించారు. వారంలోగా వార్డుల వారీగా పనులు పూర్తి కావాలన్నారు. అనంతరం పీడీఎస్ యూ నాయకులు కోస్గిలో డిగ్రీ కళాశాల, బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీ నివాస్, బాలేశ్, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
వైకుంఠధామాలు ప్రారంభం
మద్దూర్, మే 20 : మండలంలోని పలు వైకుంఠధామలను ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి ప్రారంభించారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, నందిగామ, గోకుల్నగర్, దుప్పటిగట్టు తదితర గ్రామాల్లో స్థానిక నాయకులతో క లిసి శుక్రవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంతోపాటు నాణ్యవంతంగా ని ర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, పంచాయతీల సంఘం మండల అధ్యక్షుడు పెద్ద వీరారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.వెంకటయ్య, ఎంపీటీసీలు, స ర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.