దేవరకద్ర రూరల్, మే 19 : ఊకచెట్టువాగులో మరిన్ని చెక్డ్యాంలు నిర్మించి జీవనదిగా మారుస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టువాగులో నిర్మించిన చెక్డ్యాంలను సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని రెండు ఊకచెట్టు వాగుల్లో ఇప్పటికే రూ.170కోట్లతో 21 చెక్డ్యాంలను నిర్మించినట్లు తెలిపారు. ఒక్కో చెక్డ్యాంలో సుమారు రెండు కిలోమీటర్లవరకు నీరు నిల్వ ఉండటంతో వాగు పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయన్నా రు. అవసరమున్నచోట మరిన్ని చెక్డ్యాంలను నిర్మించేందుకు కృషి చేస్తానని, ఇందు కు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పెద్దవాగు పరిశీలన
మూసాపేట, మే 19 : మండలంలోని నిజాలాపూర్, పోల్కంపల్లి పెద్దవాగులను గురువారం రిటైర్డ్ ఈఎన్సీ విజయప్రకాశ్తో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పరిశీలించారు. నిజాలాపూర్లో నిర్మించిన చెక్డ్యాంతో కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే పోల్కంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో రెండు వాగులను పరిశీలించారు. రెండు వాగుల్లో చెక్డ్యాంలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమం లో ఇరిగేషన్ సీఈ వెంకటరమణారెడ్డి, ఎస్ఈ నర్సింగరావు, ఈఈ ప్రతాప్సింగ్, డీఈలు చందూలాల్, కృష్ణ, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, నాయకులు గూపని కొండయ్య, చంద్రశేఖర్, మశ్చేందర్నాథ్, రాజు, ఖలీం, భీమన్న, జగన్, శ్రీనివాసులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.