మహబూబ్నగర్, మే 19 : మండలాల్లో గ్రామీణ క్రీడాప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. పల్లెప్రకృతి వనాలు, క్రీడాప్రాంగణాలకు స్థలాలను తక్షణమే గుర్తించి కేటాయించాలని సూచించారు. తెలంగాణకు హరితహా రం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలను పూర్తిస్థాయిలో నాటాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామా ల్లో వైకుంఠధామాలు, వెజ్, నాన్వెజ్ మా ర్కెట్లు, సెగ్రిగేషన్షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అలాగే దళితబంధు యూనిట్లను లబ్ధిదారులకు మంజూ రు చేయాలన్నారు.
ఇబ్బందులు కలుగకుండా చూడాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమావేశ మం దిరంలో జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపీఎంఎస్ శాతాన్ని పెంచాలని, మార్కెటింగ్ శాఖ ద్యారా ఇటీవలే 2వే ల టార్పాలిన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాటన్నింటినీ తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, సివిల్సైప్లె డీఎం జగదీశ్, ఎస్వో వనజాత, జెడ్పీ సీఈ వో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
మిగిలిన ప్లాట్లకు వేలం
రాజీవ్స్వగృహ సారికా టౌన్షిప్లో మి గిలిపోయిన ఓపెన్ ప్లాట్లకు జూన్ 20నుంచి 26వ తేదీవరకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటనలో తెలిపారు. మొదటివిడుత వేలం నిర్వహించిన తర్వాత ఇంకా 348 ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో బహుళ ప్రయోజనం కల్గిన ప్లాట్లు 14, ఇండ్ల నిర్మాణానికి సంబందించి 334 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. మరింత సమాచారం కోసం 76750 75365 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
తూకంలో తేడా రావొద్దు
రాజాపూర్, మే 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో ఎటువంటి తేడా రావొద్దని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నాణ్యతను పరిశీలించారు. అలాగే గన్నీబ్యాగులు, టార్పాలిన్ కవర్ల వివరాలను తెలుసుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూ చించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.