మరికల్, మే 15 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేపై అస త్య ఆరోపణలు చేస్తున్నారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఇంటి వద్ద ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అభివృద్ధిలో భాగంగా మంత్రి కేటీఆర్ నా రాయణపేట పర్యటనలో జనాన్ని చూసి ఓర్వలేక కొన్ని సమాచార చానళ్ల వారుతప్పుడు ప్రచారాలు చే శాయన్నారు. ఆ చానళ్లకు జనమే బుద్ధి చెబుతారన్నారు. కొందరు పని గట్టుకొని ఎమ్మెల్యే బీజేపీ లో చేరుతారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎ మ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీల నేతలు అసత్య ఆరోపణ లు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పేట అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న నాయకుడిపై లేనిపోని విమర్శలు చేయ డం సిగ్గు చేటన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఎమ్మె ల్యే అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం త థ్యమన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి కృష్ణారెడ్డి, ఎం పీటీసీ గోపాల్, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రామస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకు లు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి హెచ్చరించారు. మండలకేంద్రంలోని వెంకట్రెడ్డి ఇంటి వద్ద ఆదివారం సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. సమావేశంలో ఎంపీటీసీ సుధీర్రావు, నాయకులు భగవంత్రెడ్డి, చంద్రశేఖర్, సునీల్రెడ్డి, సుదర్శన్గౌడ్, తిమ్మరాజు, ఆహ్మద్, కుర్మయ్య, నర్సింహులు, మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.