గద్వాలటౌన్, మే 15 : వ్యాయామంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే క్రీడల్లో ఈతకు మిం చిన ఆట మరోటి లేదు. ఉదయం, సాయం త్రం వేళల్లో గంటపాటు ఈత కొట్టడం వల్ల శరీరంలోని 600 కిలో క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని వ్యాయా మ నిపుణులు వెల్లడిస్తున్నారు. అ లాగే ఇది శరీరానికి ఎంతో మేలును చేకూర్చుతుం ది. ఈత చక్కని శరీరాకృతిని అందిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం, హృద్యోగ్ర వ్యా ధుల నియంత్రణ కు ఈతకు మించిన దివ్యఔ షధం మరోటి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అందుకే కాబోలు పట్టణ ప్రాంతాల్లో ఇటీవల కా లంలో స్విమ్మింగ్ ఫూల్స్లో సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుం డా అంద రూ ఈతపై మక్కువను చూపిస్తున్నారు. అయితే ఈత కొట్టే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణానికే ముప్పు తెస్తుంది. అందుకే ఈత కొట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు సంబంధించిన ప్రత్యేక కథనం మీకోసం..
వేసవి వచ్చిందంటే పిల్లల సందడి చెప్పనక్కర్లలే దు. వార్షిక పరీక్షలు ముగించుకొని గ్రామాలకు చే రిన పిల్లలతో గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. వేస వి తాపాన్ని భరించలేక పిల్లలు వ్యవసాయ బావు లు, చెరువులు పంటకాల్వల్లో ఈత కొట్టడానికి బారులు తీరుతున్నా రు. ఈతరాని పిల్లలు ఈత ను నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. పిల్లల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వారికి ఈతను నేర్పించేందుకు మంచి శిక్షకుని కోసం వె దుకుతున్నారు. ఈత వచ్చిన పిల్లలతో, ఈతరాని పిల్లలు బావులకు వెళ్లేటప్పడు జాగ్రత్తలు పాటించకుంటే కడుపుకోత మిగులుతుందన్న భయం తో తల్లిదండ్రులు వారిని ఆ ఛాయలకు వెళ్లనీయ కుం డా చూస్తున్నారు.
ఐదేళ్ల తరువాతే ఈత..
కనీసం ఐదేళ్ల తరువాతనే ఈత నేర్చుకొనేందుకు పిల్లలను ప్రోత్సహించాలని నిపుణులు చెప్తున్నా రు. అంతకన్నా తక్కువ వయస్సు వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఈతకు వెళ్లనీయరాదు. విషజ్వరా లు, జలుబు, చర్మవ్యాధులు ఉన్న వారు ఈతకు దూరంగా ఉండటమే మంచిది. వ్యవసాయ బావు ల్లో, కాల్వల్లో పిల్లలు, పెద్దలు అధికసంఖ్యలో ఉ న్నప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ బావులు, చెరువులు, కాల్వల్లో ఈత కొట్టేటప్పుడు పిల్లలు దాగుడుమూతలు ఆడటం, అడుగు కువెళ్లి మట్టిని తేవడం లాంటివి చేస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం నీళ్లల్లో దాగే సమయంలో నీళ్లు తాగుతుంటారు తద్వారా ఇన్పెక్షన్ అయి రోగాలు వచ్చే అ వకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి చే యకుండా తల్లిదండ్రుల పిల్లలను వారించాలి. మూర్చరోగులు ఈతకు దూరంగా ఉంటే మంచి ది. ఈతకు కొట్టేందుకు వెళ్లేముందు ఎలాంటి ఘ న ఆహారం తీసుకోరాదు. ఒకవేళ తీసుకుంటే గం ట నుంచి రెండు గంటల తర్వాతనే ఈతకు ఉపక్రమించాలి.
ప్రమాదాలు ఇలా..
గ్రామాల్లోని చెరువుల్లో గుంతలుంటాయి. బావుల్లోనైతే సొరికలుంటాయి. అలాగే కొన్ని బావులు పూడికతోనిండి ఉంటాయి. వాటిని గమనించకుండా ఈతకు దిగితే ప్రమాదాలు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలు ఇలాంటివే.. అందువల్ల పిల్లలు ఈతకు వెళ్లేముందు వీటి ని గమనించాలి. ఎవరు వెళ్లని బావుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోరాదు. ఇలా ఉం టే పంటకాల్వల్లో సైతం ఇటీవల కాలంలో ఈత కొట్టేవారి సంఖ్య ఎక్కువవుతోంది. కాల్వల్లో ఈత కొట్టేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉం డాలి. అకస్మాత్తుగా నీటి ప్రవహం పెరిగేఅవకాశాలు ఉంటాయి.
ఈతకు రక్షణ కవచాలు ఇవి..