గద్వాల అర్బన్, మే 11 : గద్వాలలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏకంగా వెబ్సైట్, ఆన్లైన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో ‘హాయ్’ అని పలకరిస్తే చాలు.. సదరు వెబ్సైట్ నిర్వాహకులు వాట్సాప్ నంబర్ అడుగుతారు. ఇక వెంట వెంటనే వాట్సాప్కు అమ్మాయిల విభిన్న రకాలు ఫొటోలు వచ్చిపడుతాయి. అలా చూస్తుండగానే రేట్లు కూడా దర్శనమిస్తాయి. హోం సర్వీస్ లేదా హోటల్ సర్వీస్లు సదుపాయం కూడా కల్పిస్తున్నారు. గతంలో లోపాయికారికంగా.. పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా చేసే దందా ఇప్పుడు చాలా తేలికగా మారిపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఈ చీకటి దందా కొనసాగుతున్నది. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దందా నిర్వహిస్తున్నారు.
దందా ఇలా..
వెబ్సైట్లోకి వెళ్లి వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయగానే అవతలి వ్యక్తి పురుషుడా..? మహిళా..? అని వివరాలు తెలుసుకొని పురుషుడు అయితే వెంటనే క్షణాల్లో అమ్మాయిల ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఒక్కో అమ్మాయికి ఒక్కో ధర నిర్ణయించారు. కామ వాంఛ తీర్చుకునేందుకు లోకల్ అయితే ఒక రేటు.. నాన్ లోకల్ అయితే ఒక రేటు తెలియజేస్తారు. గంటకు ఒక లెక్క.. రాత్రికి అయితే ఇంకో లెక్క ధర నిర్ణయించారు. గంటకు దాదాపుగా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు.., రాత్రి అయితే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు రేటు
మాట్లాడుకుంటారు. ఈ తరహాలో చీకటి దందాను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నారు. ఈ దందాలో ముఖ్యంగా విద్యార్థినులు, గృహిణిలు ఉంటున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్, కామారెడ్డి, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట, అనంతపూర్ జిల్లాల నుంచి విద్యార్థినులు, మహిళలు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వస్తున్నారు. సదరు అమ్మాయి 2, 3 రోజులు ఇక్కడే ఉండి దందా ముగించుకొని తిరిగి వెళ్లిపోతుంది. ఇలా రోజుకు పదుల సంఖ్యలో అమ్మాయిలు వస్తున్నట్లు సమాచారం.