మాగనూర్, మే 7 : రోడ్లపై విగ్రహాలకు అనుమతి ఇ వ్వొద్దని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధికారులను ఆదేశాంచారు. మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ శ్యామలమ్మ అ ధ్యక్షతన మండల సర్వసభ్య సమవేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చిట్టెం హాజరై మాట్లాడుతూ రోడ్లపై జెండాలు, విగ్రహాలు పెట్టేందుకు అ నుమతి ఇవ్వొద్దని సూచించారు. మండలంలోని వడ్వట్ అంగన్వాడీ కేం ద్రంలో ఆయాగా పని చేస్తున్న తాయమ్మ మృతి చెంది ఏడాది దాటినా అదే పేరుతో కోడలుకు అధికారులు జీతాలు ఎలా ఇస్తున్నారని, సర్వసభ్య సమావేశంలో చెప్పినా ఇప్పటికి అదే తీరు కొనసాగుతుందని, ఇం త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సూపర్వైజర్ అరుణపై ఎమ్మెల్యే మండిపడారు. మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేసి పంచాయతీలకు అప్పగించాలన్నారు.
ఏఈ సర్పంచులకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏవో హరిత మాట్లాడుతూ మండలంలోని రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉ న్న షాపుల్లో కొనాలని సూచించారు. రైతు లు తాము కొనుగోలు చేసిన విత్తనాలకు యజమాని నుంచి విధిగా రసీదు పొందాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కార్యదర్శులతో మాట్లాడుతూ జీపీల్లో నిల్వ ఉన్న డ బ్బులను గ్రామ అభివృద్ధికి కేటాయించి ప నులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు నివేదికలను చ దివి వినిపించారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ఎంపీపీ తిప్పయ్య, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎం సహాయ నిధి
పేదలకు వరం సీఎం సహాయ నిధి అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వ ర్కూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్కు సీఎం సహా య నిధి నుంచి మంజూరైన రూ.60,000ల చెక్కును శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, అం దులో భాగంగానే సీఎం సహాయ నిధి పథకం అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య, నేరడగం సర్పంచ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.