రాజాపూర్, మే 4: సీమాంధ్ర పాలనలో పల్లెలు అంటే పెంటకుప్పలు, మురికికాల్వలు.. గుంతల రోడ్లు..అనే చందంగా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రామాల స్వరూపమే మారిపోయింది. నేడు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో పల్లెలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉండేవి. ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటుతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి.
రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామం ఉమ్మడి బాలానగర్ మండలంలోనే పెద్దది. గత ప్రభుత్వాలు అందించే అరకొర నిధులు ఏ గ్రామానికి ఇవ్వాలో అని ప్రజాప్రతినిధులు, అధికారులు తలలు పట్టుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. సర్పంచ్ మహేశ్వరి గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి, గ్రామస్తులు,అధికారుల సహకారంతో గ్రామంలో పెంటకుప్పలు, పాతబడ్డ ఇండ్లను తొలగించి, పాతబావులను పూడ్చివేశారు.
నిధులు మంజూరు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామంలో రూ.22లక్షలతో అండర్డ్రైనేజీ, రూ.కోటీ 10లక్షలతో 100శాతం సీసీరోడ్ పనులను పూర్తి చేశారు. వీటీతోపాటు రూ.2లక్షల 50వేలతో
పల్లెప్రకృతివనం, రూ.2లక్షల 60వేలతో డంపింగ్యార్డు, రూ.12లక్షల 60వేలతో
వైకుంఠధామం పనులు పూర్తి చేశారు. పచ్చదనం కోసం గ్రామంలో గల్లీగల్లీలో సీసీ రోడ్డుకు
ఇరువైపులా మొక్కలునాటడంతో పచ్చని తోరణంలా చెట్లు స్వాగతం పలుకుతున్నాయి.
సర్పంచ్ కావడం సంతోషంగా ఉంది..
నేను గతంలో ఉమ్మడి మండలంలో ఎంపీటీసీగా పని చేసిన కానీ గ్రామానికి ఎలాంటి సేవలు అందించలేక పోయాను. తెలంగాణ వచ్చాక సర్పంచ్ కావడంతో గ్రామ అభివృద్ధి కల నెరవేరింది. గ్రామంలో ఇప్పటికే దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. గ్రామాభివృద్ధ్దికి తగిన నిధులు అందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి గ్రామం రుణపడి ఉంటుంది.
– దాచని మహేశ్వరి, తిర్మలాపూర్ సర్పంచ్