జడ్చర్లటౌన్, ఏప్రిల్ 16 : మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని హౌసింగ్బోర్డుకాలనీలో శనివారం ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. 7వ వార్డులోని సత్యేశ్వర ఆశ్రమం సమీపంలో వైకుంఠధామం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గంజ్ ఏరియాలోని ఎస్బీహెచ్ బ్యాంకు ప్రాంతం నుంచి రామా టాకీస్వైపు వెళ్లే మేజర్ డ్రైనేజీ కాలువను పరిశీలించారు. అదేవిధంగా 18,19 వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. మున్సిపాలిటీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 18వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడి ఇంటి వద్ద ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.