వనపర్తి రూరల్, మార్చి 30 : వ్యవసాయ పంట రుణాలను విడుతల వారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. కరోనా కారణంగా రుణమాఫీ ఆలస్యమైన విషయం వాస్తవమే అన్నారు. రాష్ట్ర ఆర్థిక లేమి కారణంగా ఇప్పటి వరకు రూ.36 వేలలోపు ఉన్న రైతులకు మాత్రమే రుణ మాఫీ వర్తింపజేశామన్నారు. రూ.36 వేల నుంచి రూ.50 వేలు, రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఉన్న రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం మా ఫీ అవుతాయని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం చై ర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక మహాజన సభ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆలోచనతో సీఎం కేసీఆర్ సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు అందిస్తున్నారని చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల కోసం వెంపర్లాడే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, సదుపాయాలను అందిపుచ్చుకొని డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలన్నారు. సహకార సంఘాలంటే అప్పులు ఇవ్వడమే కాకుం డా రైతుల ఆర్థికాభివృద్ధి మార్గాలు వేయాలని సూచించారు. ఆర్థికంగా ఉన్న ఇతర ప్రాంతాల సహకార సంఘాల కార్యాలయాలను నియోజకవర్గంలోని సంఘాల చైర్మన్లు కలిసికట్టుగా సందర్శించి అ క్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలన్నారు.
ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో సంఘాలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూ పొందిస్తుందన్నారు. త్వరలోనే వాటి కోసం జీవోను తీసుకొస్తున్నట్లు చెప్పారు. సహకార సంఘాలు, రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకు నే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సహకార సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం నిరంజన్రెడ్డికి శాలువా, గజమాల, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. సహకార సంఘం మంజూరు చేసిన రుణా ల చెక్కులను అందజేశారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సహకార సంఘా ల చైర్మన్లు మధుసూదన్రెడ్డి, విజయ్కుమార్, కోదండరాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సర్పంచుల సంఘం మాజీ కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, డీసీసీబీ జిల్లా సీఈవో లక్ష్మయ్య, వనపర్తి సహకార సంఘం సీఈవో గోపాల్, విండో డైరెక్టర్లు, సర్పంచులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పాన్గల్, మార్చి 30 : రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం పాన్గల్, శాగాపూర్, కేతేపల్లి, జమ్మాపూర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేతేపల్లి స మీపంలో కొన్నేండ్లుగా వంతెన లేక ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అందుకే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించినా వంతెన మంజూరు కాలేదన్నారు. తెలంగాణలో నేడు సాధ్యమైందని తెలిపారు. పాలమూరు జిల్లా నేడు అన్నపూర్ణగా మార్చామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.