అయిజ, జనవరి 23: కొలిచే వారికి కొంగు బంగారంగా స్వ యంభూ గుండ్ల భీమరాయుడు భక్తుల పాలిట ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. బుధవారం నుంచి 29వ తేదీ వరకు గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా మాఘశుద్ధ చవితి నుంచి మాఘ శుద్ధ పంచమి వరకు గుండ్ల భీమరాయుడికి గ్రామస్తులు బ్ర హ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని తొత్తినోనిదొడ్డి గ్రామ శివారులో వెలిసిన గుండ్ల భీమరాయుడును భక్తులు తరతరాలుగా భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుండ్ల భీమరాయుడిని భక్తులు తమ ఇంటి దైవంగా కొలుస్తా రు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రా ష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజలు చేయనున్నారు. గుండులో భీమరాయుడు కొలువుదీరడంతో గుండ్ల భీమరాయుడిగా భక్తులు కొలుస్తున్నారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ను తొత్తినోనిదొడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు అంగరంగ వైభవం గా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అశేషంగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన కమిటీ సకల సౌకర్యాల ను కల్పిస్తోంది. ఈ నెల 25 నుంచి 29వ తేదీవరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ, గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్రహ్మోత్సవాల వివరాలు ..
బుధవారం ఉదయం 9 గంటలకు గుండ్ల భీమరాయుడి ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా పల్లకీలో ఊరేగింపు, రాత్రి 11 గంటలకు ప్రభోత్సవం
(26న) గురువారం ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రి 2 గంటలకు రథోత్సవం
(27న) శుక్రవారం ఉదయం అంతర్రాష్ట్ర ఓపెన్ ఆల్ కబడ్డీ పోటీలు, అంతర్రాష్ట్ర స్థాయి సందెరాళ్లు, దొబ్బుడు గుండ్లు, గుబ్బల గుండ్లు, ఇసుక సంచులు ఎత్తు పోటీలు, కుక్కల పరుగు పందెం పోటీలు
(28న) శనివారం అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు
(29న) ఆదివారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.