మహబూబ్నగర్, డిసెంబర్ 21 : సమీకృత కలెక్టరేట్లో జనవరి 1నుంచి ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 27, 28 తేదీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటల్లోగా అన్నిశాఖల ఉద్యోగుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. జనవరి 1నుంచి మ్యానువల్ రిజిస్టార్ ఉండదన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకుగానూ 4 మిషన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగులలో క్రమశిక్షణతోపాటు సమయపాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా మాన్యువల్ ప్రకారం సాధారణ సెలవులను కలెక్టర్కు సమర్పించాలని తెలిపారు. ఈవోఎల్ ఇతర సెలవుల కోస సం బంధిత శాఖాధిపతికి పంపూతూ తనకు కూడా సమాచారం అందించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ విధానంపై 23న పా యింట్పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో అనిల్కుమార్, ఏవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.