జడ్చర్ల, జనవరి 23 : పట్టణంలోని నల్లకుంట మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రూ.కోటితో చేపట్టిన మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మినీ ట్యాంక్బండ్ను సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ట్యాంక్బండ్పై వాకింగ్ట్రాక్తోపాటు ప్రజలు సేద తీరేందుకు బెంచీ లు, పచ్చిక ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఫీవర్ సర్వే పరిశీలన
పట్టణంలోని పద్మావతికాలనీలో చేపట్టిన ఫీవర్ సర్వేను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టిందని తెలిపారు. ప్రతి ఇంటినీ సర్వేచేసి జ్వ రపీడితులకు మందులను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పా టించాలని సూచించారు. అనంతరం 24వ వార్డులో ఎమ్మె ల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కును పరిశీలించారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
మున్సిపల్ కార్మికురాలు భాగ్యమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక ఇందిరానగర్లోని మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.20వేల ఆర్థికసా యం అందజేశారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, కౌన్సిలర్లు జ్యోతీకృష్ణారెడ్డి, శశికిరణ్, లత, కోట్ల ప్రశాంత్రెడ్డి, పుష్పలత, నాగిరెడ్డితోపాటు దోరేపల్లి రవీందర్, కొంగళి నాగరాజు, రామ్మోహన్, సూర్యప్రకాశ్రెడ్డి, మురళి, బీకేఆర్, శివదర్శన్, వెంకటస్వామి, నర్సింహులు, సత్యం, విజయ్ పాల్గొన్నారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
మిడ్జిల్, జనవరి 23 : క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం చాంపియన్ క్రికెట్ పోటీల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తపల్లిలో మినీ స్టేడియం ఏర్పాటుకు రూ.5లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, పాండు, సుధాబాల్రెడి, శ్రీనివాస్గౌడ్, బాలు, వెంకట్రెడ్డి, నిర్వాహుకులు ఆంజనేయు లు, రాజు, శివకుమార్, రమేశ్, పాండు, కృష్ణ య్య, బాబా, కాడయ్య, రఫీ, రాములు, రామ్మోహన్ ఉన్నారు.
రోడ్డు విస్తరణకు సహకరించాలి
మండలకేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తా నుంచి గొల్ల బాలయ్య ఇంటివరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు గ్రామస్తులు సహకరించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. నవాబ్పేటలో రూ.కోటీ 30లక్షలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాప్రయోజనాల కోసమే రోడ్డు విస్తరణ చేపడుతున్నామని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడు కూచూరి చిన్నయ్య తండ్రి వీరన్న పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గండు చెన్నయ్య, సర్పంచ్ గోపాల్గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు ప్రతాప్, అబ్దుల్లా, నవనీతరావు, మల్లెపాగ నర్సింహులు, గిరియాదవ్, గండు తిరుపతయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.