అయిజ రూరల్, డిసెంబర్ 21 : సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఓ తాపీ మేస్త్రీ పాదయాత్ర చే పట్టాడు. జోగుళాంబ గద్వాల జి ల్లా అయిజ మండలం వెంకటాపు రం గ్రామానికి చెందిన కొమ్మువా రి తిమ్మన్న తనయుడు, తాపీ మేస్త్రీ ప్రసాద్కు కేసీఆర్ అంటే అభిమానం. కేసీఆర్ పీఎం కావాలని బుధవారం గ్రామం నుంచి హైదరాబాద్లోని ప్రగతి భవన్ వరకు పాదయాత్ర మొదలుపెట్టాడు. అతడికి దారిపొడవునా ప్రజలు, నాయకులు ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఆయన పాలన దేశానికి అందిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. అందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర కొనసాగిస్తానన్నారు.
పాదయాత్రికుడికి సాయం ..
వడ్డేపల్లి, డిసెంబర్ 21 : వెంకటాపురం నుంచి ప్రగతిభవన్కు ప్రసాద్ చేపట్టిన పా దయాత్ర బుధవారం సాయంత్రం శాంతినగర్కు చేరింది. యువకుడికి మున్సిపల్ చైర్పర్సన్ కరుణ స్వాగతం పలికారు. మద్దతుగా అతడి వెంట కొద్దిదూరం నడిచారు. దారి ఖర్చుల కోసం అతడికి ఆర్థిక సాయం అందించారు.