మహబూబ్నగర్టౌన్, జనవరి 23 : స్వా తంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని మల్లికార్జున్ చౌరస్తాలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బాబుల్రెడ్డి, పాండురంగం, సతీశ్, శ్రీనివాసులు, నరేశ్ పాల్గొన్నారు. అలాగే ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నేతాజీ జయంతిని చరిత్ర అధ్యాపకుడు రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ అంజ య్య తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, ప్రశాంత్, పవన్, సతీశ్, రామకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
మున్సిపాలిటీలోని అమిస్తాపూర్లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు శ్రీధర్, సత్యం, సదానంద్, శ్రీనివాసులు, తిరుపతి, రా మకృష్ణ, ఆనంద్, గ్రామస్తులు శివరాజు, నరేంద ర్, శ్రీశైలం పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మండలకేంద్రంలో ఏబీవీపీ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల కన్వీనర్ రాము, శేఖర్, అరవింద్, శివ, అంజి, అవిజ్, రాము, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల్లో యువకులు మిఠాయిలను పంపిణీ చేశారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
ఉమ్మడి గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహ్మదాబాద్ మండలం నంచర్లగేట్లో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్వ కృష్ణ, శంకర్నాయక్, నర్సింహులు, జయవర్ధన్రెడ్డి, శ్రీనివాస్, ప్రభునాయక్, నవీన్, అంజి, కేశవులు, అనిల్, కృష్ణ, బాలు, అరుణ్, సాంబ, శ్రీనివాసులు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మండలకేంద్రంతోపాటు పొన్నకల్, రాచాల, కందూరు, శాఖాపూర్, పెద్దమునగల్చేడ్ తదితర గ్రామాల్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వా తంత్య్రం కోసం నేతాజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, వేము ల, జానంపేట, నందిపేట, చక్రాపూర్, పోల్కంపల్లి తదితర గ్రామాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండలకేంద్రంలో నేతాజీ యువజన సంఘం నాయకులు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన విద్యార్థులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ముందుగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు.