బాలానగర్, డిసెంబర్ 14 : మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే హరితహారం మొక్కలను పరిశీలించారు. రోజూ మొక్కలకు నీరందించి సంరక్షించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.