జడ్చర్ల, నవంబర్ 29 : జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో డిసెంబర్ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల సమీపంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేం ద్రంలో నూతన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని సూచించారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలను సభకు తీసుకొచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు.
సమావేశంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రా ష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, మండ ల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, రాములూనాయక్, శ్రీనివాస్, రవీందర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, నర్సింహులు, రామకృష్ణారెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మ య్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, మల్లేశ్, నవాబ్పేట జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, ఉమాశంకర్గౌడ్, నవనీతాకొండల్, జ్యోతీకృష్ణారెడ్డి, లత, నందకిశోర్, రమేశ్, సతీశ్, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్, శ్రీశైలంయాదవ్, సర్పంచ్ ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు.